Telugu Gateway
Andhra Pradesh

ప‌రిటాల సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌రిటాల సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

ప్ర‌భుత్వ ప్రాయోజిత ఉగ్ర‌వాదానికి నిర‌సనగా అంటూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు దీక్ష రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. ఆయ‌న గురువారం నాడు దీక్ష ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీకి చెందిన కీల‌క నేత‌లు అంద‌రూ పాల్గొన్నారు. శుక్ర‌వారం నాడు ఈ స‌మావేశంలో మాట్లాడిన ప‌రిటాల సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మాలో ప్రవహించేది సీమ రక్తమే'' అని అన్నారు.

తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని... ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని అన్నారు. చంద్రబాబు తీరు మారాలని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత హెచ్చరించారు. దీక్ష సంద‌ర్భంగా మాట్లాడిన నేత‌లు అంద‌రూ ప్ర‌భుత్వంపై, వైసీపీ నేత‌ల‌పై తీవ్ర విమర్శ‌లు చేస్తున్నారు.

Next Story
Share it