Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుపై మరో కేసు నమోదు

చంద్రబాబుపై మరో కేసు నమోదు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీలో మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే కర్నూలులో ఓ కేసు పెట్టగా, ఇప్పుడు గుంటూరులో కేసు పెట్టారు. ఏపీలో ఎన్‌440కే వైరస్‌ ఉందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారంటూ న్యాయవాది పచ్చల అనిల్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై 118, 505(1)బి, 505(2), 54 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

అయితే కర్నూలులో నమోదు అయిన కేసుకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కానీ ఎందుకో ఇప్పటివరకూ నోటీసులు ఇవ్వకపోగా..ఇప్పుడు మరో కొత్త కేసు నమోదు అవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే వైరస్ పై మంత్రి అప్పలరాజు కూడా ఓ ఛానల్ లో మాట్లాడారని..దీని వల్ల కూడా ప్రజలు భయపడ్డారంటూ టీడీపీ కూడా కర్నూలు స్టేషన్ లోనే మంత్రిపై ఫిర్యాదు చేసింది.

Next Story
Share it