Telugu Gateway
Andhra Pradesh

డీపీఆర్ కోసం టెండర్లు

డీపీఆర్ కోసం టెండర్లు
X

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు మేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఊపు అందుకుంటాయి అని ప్రభుత్వం చెపుతోంది. ఇప్పటికే రాజధాని పనుల కేటాయింపు దాదాపు పూర్తి అయింది. సచివాలయం ఐకానిక్ టవర్ల టెండర్లు కూడా ప్రధాని పర్యటన ముందే ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఏపీ క్యాపిటల్ సిటీ అమరావతిలోని నీరుకొండ గ్రామంలో మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుతో పాటు స్మారకం కూడా నిర్మించబోతున్నారు.

దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్స్ ను పిలుస్తూ అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎఫ్ పీ జారీ చేసింది. ఆసక్తి ఉన్న సంస్థలు మే 14 నాటికి తమ బిడ్స్ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి ఎన్టీఆర్ భారీ విగ్రహం తో పాటు స్మారకం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది.

Next Story
Share it