Telugu Gateway
Andhra Pradesh

ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య కొత్త వివాదం

ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య కొత్త వివాదం
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త వివాదానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. గత కొంత కాలంగా టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్, తెలుగు దేశం పార్టీల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భగా గురువారం నాడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు దివంగత నేతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో హరికృష్ణతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయన అభిమానులు. అయితే ఈ ఫ్లెక్సీల తొలగింపు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఎన్టీఆర్ ఘాట్ కు నందమూరి బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఫ్లెక్సీల తొలగింపు జరగటం దుమారం రేపుతోంది. ఫ్లెక్సీలను తీయించాలని బాలకృష్ణ చెప్పినట్లు వినిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేయటం ఈ దుమారానికి కారణం అయింది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీల తొలగింపు వీడియోలు మీడియాలో రావటంతో ఈ పరిణామంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో బాలకృష్ణ అనవసర వివాదం తెర మీదకు తెచ్చినట్లు అయింది అని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు అరెస్ట్ అయినా సమయంలో కూడా ఎన్టీఆర్ మౌనంగానే ఉన్నారు. అప్పటిలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చం నాయుడు ని ప్రశ్నిస్తే ఈ విషయాన్నీ మీరు ఆయన్నే అడగండి అన్నారు. బాలకృష్ణ కు కూడా దీనిపై ప్రశ్నలు ఎదురుకాగా ఐ డోంట్ కేర్ బ్రో అంటూ భగవంత్ కేసరి సినిమాలోని డైలాగు చెప్పారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ మరింత పెరిగింది అనే చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం తెలుగు దేశం సభలో కొంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయన ఫొటోలతో హంగామా చేయగా వాళ్లపై దాడి కూడా జరిగింది.

Next Story
Share it