Telugu Gateway
Andhra Pradesh

నామినేషన్ల రోజు..నామినేషన్ పత్రాలే లేవు

నామినేషన్ల రోజు..నామినేషన్ పత్రాలే లేవు
X

ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఇదో అనూహ్య పరిణామం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నాడు నామినేషన్లు ప్రారంభం కావాలి. నామినేషన్లు వేసేందుకు కొంత మంది అభ్యర్ధులు ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. అసలు నామినేషన్ పత్రాలు లేవు సరికదా..వాటిని తీసుకునే వారు కూడా లేరు.

ఎస్ఈసీ, ఏపీ సర్కారు మధ్య వివాదం నడుస్తుండటంతో అధికారులు కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఈ నోటిఫికేషన్, ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై సోమవారం నాడు విచారణ జరగనుంది. మరి సుప్రీం తీర్పు తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందో లేదో వేచిచూడాల్సిందే. కారణాలు ఏదైనా కూడా ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story
Share it