Telugu Gateway
Andhra Pradesh

వరస పరిణామాలతో వైసీపీ లో టెన్షన్ టెన్షన్!

వరస పరిణామాలతో వైసీపీ లో టెన్షన్ టెన్షన్!
X

గత ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కలకలం. జిల్లాలో వరసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నెల్లూరు జిల్లా నేతల స్టైల్ వేరే ఉంటుంది. వాళ్ళు సొంత పార్టీ ని..సొంత ప్రభుత్వాన్ని విమర్శించటానికి కూడా ఏ మాత్రం వెనకాడరు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు అనే చెప్పొచ్చు. అయితే రాజకీయగంగా జరిగే మార్పులను కూడా వీళ్ళు బాగా పసికడతారు అని...ప్రజల మూడ్ ను గమనించే పార్టీల మార్పులకు నిర్ణయం తీసుకుంటారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కారణాలు ఏమైనా ఇప్పటికే అధికార వైసీపీ కి చెందిన మూగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ని వీడారు. బుధవారం నాడు ఆ పార్టీ రాజ్య సభ ఎంపీ, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా గా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ కి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ని వీడుతున్నట్లు అయన తన లేఖలో ప్రస్తావించినా కూడా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరుతో వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే రాజీనామా చేశారు అని చెపుతున్నారు. అసంతృప్తితో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయాన్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి ఉన్నారు. తాజాగా రాజ్య సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. రాబోయో రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.

Next Story
Share it