Telugu Gateway
Andhra Pradesh

మోడీ..జ‌గ‌న్ ల‌పై నాగ‌బాబు వ్యంగాస్త్రాలు!

మోడీ..జ‌గ‌న్ ల‌పై నాగ‌బాబు వ్యంగాస్త్రాలు!
X

న‌టుడు, జ‌న‌సేన పీఏసీ స‌భ్యుడు నాగ‌బాబు చేసిన ట్వీట్ రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న నేరుగా పేరు పెట్ట‌క‌పోయినా స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, సీఎం జ‌గ‌న్ ల‌పై వ్యంగాస్త్రాలు సంధించిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. జ‌న‌సేన‌-బిజెపి పొత్తు కొన‌సాగుతున్న త‌రుణంలో నాగ‌బాబు ఏకంగా మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఏకంగా మోడీ, జ‌గ‌న్ లు చిరంజీవి కంటే అద్భుతంగా న‌టించార‌ని పేర్కొన‌టం విశేషం. నాగ‌బాబు ట్వీట్ ఇలా ఉంది..'మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు.

ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు' అంటూ పేర్కొన్నారు. నాగ‌బాబు ట్వీట్ చూసిన త‌ర్వాత జ‌న‌సేన‌-బిజెపిలు దూరం కాబోతున్నాయ‌నే దానికి ఇది సంకేత‌మా అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఎందుకంటే ఏకంగా మోడీని నాగ‌బాబు అద్భుతంగా నటించారు అన్నారంటే ఇది ఆషామాషీ వ్యాఖ్యేమీ కాదు. తొలుత ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవికి మాత్ర‌మే ఆహ్వానం అందింది. దీనిపై మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు రావ‌టంతో త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆహ్వ‌నించారు. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వీడియో ద్వారా తెలిపారు. కానీ ఆయ‌న మాత్రం అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాని విష‌యం తెలిసిందే.

Next Story
Share it