Telugu Gateway
Andhra Pradesh

మతాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బిజెపి

మతాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బిజెపి
X

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అమలుపరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తిని గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు. టీడీపీ, బిజెపిల తీరును ఆయన తప్పుపట్టారు. తిరుపతి ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని.. మతాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. లబ్దిదారులే తమకు ఓట్లు వేయాలనుకుంటున్నారని తెలిపారు.

వాలంటీర్లు ఎవరినీ ప్రభావితం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబుపై రాళ్ల దాడి అవాస్తవమని అన్నారు. చంద్రబాబు ఆరోపణలు అసత్యమన్నారు. ' చంద్రబాబుపై రాళ్లదాడి అంతా బూటకమని తేలింది. ఆ పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా ఆడారు. టీడీపీ మూతపడటం ఖాయం. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం జవాబు చెబుతారని'' మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు

Next Story
Share it