కొట్టు సత్యనారాయణకు పదవి వెనక అంత కథ నడిచిందా?!

బండారు సత్యనారాయణ మూర్తి చేసిన ఆరోపణల్లో నిజనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ..ఆయన ఈ సబ్జెక్ట్ కు చేసిన లింక్ చూస్తే మాత్రం ఎవరికైనా అనుమానాలు రాకమానదు అని గట్టిగా చెప్పొచ్చు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్నా ఈ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా పలు అనుమానాలకు తావిచ్చేదిలాగా ఉందని అధికార వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. ఎన్ సీసీకి దక్కిన వేల కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టు సత్యనారాయణ సోదరుడికి చెందిన జీఆర్ పీఎల్ హౌసింగ్ చేతికి మారిందని బండారు సత్యానారాయణ మూర్తి తెలిపారు. ఈ భూమి విలువ వెయ్యి కోట్ల రూపాయలపైనే ఉంటుందని తెలిపారు. అదే సమయంలో కొట్టు సత్యనారాయణ సోదరుడు అయిన కొట్టు మరళీక్రిష్ణకు చెందిన మరో ప్రాజెక్టులోని విశాలమైన స్థలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలాసవంతమైన భవనం నిర్మిస్తున్నారని, ఇది వారి మధ్య కుమ్మక్కుకు నిదర్శనం అని ఆయన ఆరోపించారు.