Telugu Gateway
Andhra Pradesh

వంద కోట్ల జరిమానా మర్చిపోయారా?

వంద కోట్ల జరిమానా మర్చిపోయారా?
X

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకపై నిరసన తెలియజేయాటాన్ని వైసీపీ ఎద్దేవా చేసింది. అసలు టీడీపీకి ఇసుక గురించి మాట్లాడే నైతిక హక్కులేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇసుక అక్రయ తవ్వకాలకు సంబంధించి ఎన్జీటీ వంద కోట్ల జరిమానా వేసిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత అయిదేళ్ల పాలనలో ఇసుకను బంగారంగా మార్చింది మీరు కాదా..?. టీడీపీ పాలనలో రాష్డ్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టానుసారంగా దోచుకున్నారు. కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసానికి ఆనుకుని డ్రెడ్జర్లతో ఇసుక తవ్వేశారు.

ఉచిత ఇసుక పాలసీ పేరుతో ఇసుకని దోచుకున్న మీరు ఎలా మాడ్లాడతారు. మీ హయాంలో ప్రారంభమైన ఇసుక దోపిడీని అరికట్టడానికే మేము అనేక ప్రయత్నాలు చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా వరదలు, తుఫాన్‌ల వల్ల ఇసుక వెలికితీయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రతిపక్షంగా సూచనలివ్వాలి కానీ అసెంబ్లీ బయట ర్యాలీ పేరుతో డ్రామాలు కాదు. చచ్చిపోయిన టీడీపీని బ్రతికించుకోవడానికి ఇసుక పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. అన్నిలోపాలని అధిగమించి కొత్త ఇసుక పాలసీ ద్వారా అందరికీ ఇసుక దొరికేలా చర్యలు తీసుకుంటాం. మాది పారదర్శకమైన ప్రభుత్వం. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

Next Story
Share it