Telugu Gateway
Andhra Pradesh

సీఎం పేషీలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌వ‌హ‌ర్ రెడ్డి

సీఎం పేషీలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌వ‌హ‌ర్ రెడ్డి
X

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల కాలంలో స‌ర్కారులో కీల‌క మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. ఎవ‌రూ ఊహించని విధంగా సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్ కు షాకిచ్చి..ఆయ‌న్ను ఢిల్లీలో ఏపీ భ‌వ‌న్ ప్ర‌ధాన రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గా నియ‌మించారు. ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డిని నియ‌మిస్తూ స‌ర్కారు ఇటీవల ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీంతో జ‌వ‌హ‌ర్ రెడ్డి సోమ‌వారం నాడు సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. దీంతో పాటు ఆయ‌న టీటీడీ ఈవో అద‌న‌పు బాధ్య‌త‌లు కూడా నిర్వ‌ర్తించ‌నున్నారు. జ‌వ‌హ‌ర్ రెడ్డి ఇటీవ‌ల వ‌ర‌కూ నిర్వ‌హించిన నీటిపారుద‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it