కుప్పం గోడలపై రాస్తే 175 సీట్లు వస్తాయా?!

కానీ తర్వాత ఏమి జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు సీఎం జగన్ సెప్టెంబర్ 22న కుప్పం పర్యటన పెట్టుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. దీనికి తోడు వైసీపీ చేసే హంగామా కూడా పెరుగుతోంది. అందుకే నిదర్శనమే ఈ వాల్ రైటింగ్స్ అని చెప్పుకోవచ్చు. కుప్పం నియోజకవర్గంలోని ఓ గోడపై 175కు 175 సీట్లు ...ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ గోడలపై రాస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా పీకె సర్వేకు సంబంధించి కొన్ని ఫలితాలు వచ్చాయని..అందులో మాత్రం లెక్క తేడాకొడుతోందని వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. గోడలపై 175 సీట్లు అని రాసినంత మాత్రాన వస్తాయా అంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.