Telugu Gateway
Andhra Pradesh

సాక్షిపై ప్రత్యేక ప్రేమ నిజమే

సాక్షిపై ప్రత్యేక ప్రేమ నిజమే
X

సాక్షి పేపర్ కు సంబంధించి చంద్రబాబు సర్కారు శుక్రవారం నాడు అసెంబ్లీ వేదికగా సంచలన విషయాలు బహిర్గతం చేసింది. గత ఐదేళ్ల కాలంలోనే ఒక్క సాక్షి మీడియా కు జగన్ ప్రభుత్వం ఏకంగా 403 కోట్ల రూపాయలపైన ప్రకటనలు ఇచ్చింది అని వెల్లడించారు. ఒక్క సాక్షి మీడియాకు ఇంత భారీ మొత్తంలో ప్రకటనలు ఇచ్చి..ఇతర మీడియా సంస్థలు..జాతీయ మీడియా కు కలుపుకుని ఐదేళ్లలో ఇచ్చింది 488 కోట్ల రూపాయలు అని ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పార్థసారధి అసెంబ్లీలో వెల్లడించారు.

గత ప్రభుత్వం ప్రకటనల విషయంలో పక్షపాతం చూపించిన విషయం వాస్తవం అన్నారు. సాక్షి కంటే ఎక్కువ సర్కులేషన్ ఉన్న వాళ్ళను కూడా కాదని ఆ పత్రిక కు మేలు చేశారన్నారు. అందరితో చర్చించి ఈ విషయంపై సభ్యులు కోరినట్లు సభా సంఘం వేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.సమాచార శాఖ నుంచి కాకుండా కొన్ని చోట్ల కలెక్టర్ లు కూడా ఈ పత్రికకు ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చారు అని తెలిపారు.

Next Story
Share it