Telugu Gateway
Andhra Pradesh

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ 17కి వాయిదా

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ 17కి వాయిదా
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐలు సమయం కోరటంతో కోర్టు వాయిదా వేసింది. ఈ పిటీషన్ పై ఇప్పటికే సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

శుక్రవారం నాడు దీనిపై విచారణ జరగ్గా..కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని..ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలపై త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it