Telugu Gateway
Andhra Pradesh

సోషల్ మీడియా లో హాట్ టాపిక్

సోషల్ మీడియా లో హాట్ టాపిక్
X

ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ. అమరావతి రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్చారు...దీని ద్వారా లాభపడ్డారు కాబట్టి అంటూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేష్ లపై కేసు లు పెట్టింది. దీనికి ప్రభుత్వం చెపుతున్న కారణం ఎల్ఈపీఎల్ భూములు పోకుండా చూశారు...హెరిటేజ్ కంపెనీ కోసం ఇక్కడ భూములు కొన్నారు అన్నది ఆరోపణ. ఎలాగూ కేసు పెట్టారు కనుక ఇక ఈ విషయం తేలాల్సింది కోర్టు లోనే. కానీ ఇప్పుడు కొంతమంది తెరమీదకు తీసుకువచ్చిన ప్రశ్నలో మాత్రం లాజిక్ ఉంది..విషయం ఉంది. ప్రతిపక్షంలో ఉండి...ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేకే అమరావతికి మద్దతు ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలు అయితే ఇక అంతే లేదు. ఇది అంతా అందరికి తెలిసిన విషయమే. ఇక వాస్తవానికి వస్తే అటు చంద్రబాబు తో సంభంధం లేకుండా...ఇటు జగన్ తో సంబంధం లేకుండా అమరావతి నూతన రాజధాని ప్రాంతంగా వస్తుంది అని ఎంతో మంది అక్కడ భూములు కొనుగోలు చేశారు.

రాజకీయాలతో సంబంధం ఉన్న వారు ఉన్నారు...అసలు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కడ వరకో ఎందుకు రాజధాని ఇక అమరావతి అనే ఫిక్స్ హైదరాబాద్ నుంచి వెళ్లిన సచివాలయ ఉద్యోగులు కూడా అక్కడ అప్పులు చేసి మరీ సొంత ఇల్లు , అపార్ట్ మెంట్ లు కొనుగోలు చేశారు. తర్వాత జగన్ సీఎం అయిన కొద్ది కాలానికి అమరావతి తూచ్ అంటూ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి మొత్తం వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టిన విషయం తెలిసిందే. జగన్ నిర్ణయం వల్ల రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వారు..ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోయారు. రాజధాని నిర్ణయం మార్పు వల్ల ఇప్పటికే అమరావతి లో పెట్టిన వందల కోట్ల రూపాయల ప్రజాధనం కూడా వృధాగా పోయినట్లు అయింది అనే చర్చ ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ అమరావతిలో తెలుగు దేశం నాయకులే వేల ఎకరాలు కొనుగోలు చేసి లబ్దిపొందటానికి ప్లాన్స్ వేసుకున్నారు అని విమర్శలు చేస్తుంటే...సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన వైజాగ్ లో వైసీపీ నేతలు భూములు కొన్నారు అని టీడీపీ విమర్శలు చేస్తోంది. కానీ మధ్యలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారు అనే చర్చ కూడా ఉంది.

Next Story
Share it