Telugu Gateway
Andhra Pradesh

ఈ స్కిల్ వైసీపీ నేతల సొంతమా!

ఈ స్కిల్ వైసీపీ నేతల సొంతమా!
X

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు ఎంతైనా వెరైటీ. వాళ్ళు చనిపోయిన వాళ్ళతో మాట్లాడమే కాదు...వైసీపీ అధినేత, సీఎం జగన్ కు బొకే లు ఇచ్చేందుకు చనిపోయిన వాళ్ళను కూడా కిందకు తీసుకువస్తున్నారు. ఈ ఫోటో చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు మరి. చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీ నాయకులకు ఎంత ఆనందం కలిగించినా...మరీ ఇలా చనిపోయిన వాళ్ళ ఫొటోలతో ఆటలాడటం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఫోటో ఒక పక్కన, మరో వైపు సీఎం జగన్, దివంగత ఎన్టీఆర్ ఫోటో లతో ఒక ఫ్లెక్సీ పెట్టారు. అందులో చనిపోయిన ఎన్టీఆర్ జగన్ కు థాంక్స్ చెప్పినట్లు రాశారు.

చంద్రబాబు జైలుకు వెళ్లిన సెప్టెంబర్ 10 ని ఆత్మ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఎన్టీఆర్ చెప్పినట్లు రాసుకొచ్చారు. ఆ ఫ్లెక్సీ లో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ సోషల్ మీడియా లో ఈ ఫోటో ను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కొంత మంది టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు అని జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. మరో వైపు వైసీపీ నేతలు అటు దివంగత ఎన్టీఆర్ తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోల ను కూడా వాడుతూ చంద్రబాబు పై విమర్శలు చేస్తూ ఫ్లెక్సీ లు పెడుతున్నారు.

Next Story
Share it