Telugu Gateway
Andhra Pradesh

ఇంకో సారి టీవీలో క‌న్పిస్తే లేపేస్తా

ఇంకో సారి టీవీలో క‌న్పిస్తే లేపేస్తా
X

సెంట్ర‌ల్ హాల్ లో ర‌ఘురామ‌కు మాధ‌వ్ బెదిరింపులు

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు లోక్ స‌భ స్పీక‌ర్ తోపాటు ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల‌కు ఫిర్యాదు చేశారు. మంగ‌ళ‌వారం నాడు లోక్ స‌భ సెంట్ర‌ల్ హాల్ లో మాధ‌వ్ త‌న‌ను బెదిరించార‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకో సారి సీఎం జ‌గ‌న్ ను తిడుతూ టీవీల్లో క‌న్పిస్తే లేపేస్తాన‌ని హెచ్చ‌రించార‌ని పేర్కొన్నారు. సెంట్ర‌ల్ హాల్ లోని సీసీటీవీ ఫుటేజీ చూస్తే మాధ‌వ్ త‌న‌ను బెదిరించిన విష‌యం తెలుస్తుంద‌ని..వైసీపీ ఎంపీలు అంద‌రూ చూస్తుండ‌గా ఆయన ఈ బెదిరింపుల‌కు దిగార‌న్నారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం 11.50 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పేర్కొన్నారు. త‌న‌ను తీవ్రంగా దుర్భాష‌లాడార‌ని..లేఖ‌లో ఈ ప‌దాలు కూడా రాయ‌లేమ‌ని తెలిపారు. స్పీక‌ర్ కు ఈ అంశంపై ఫిర్యాదు చేశాన‌ని..స‌భా నాయ‌కుడిగా ఈ అంశం మీ దృష్టికి తెస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ‌లో తెలిపారు. ఈ అంశాలు అన్నీ గ‌మ‌నంలోకి తీసుకుని ఏపీ ప్ర‌భుత్వం నుంచి గోరంట్ల మాధ‌వ్ నుంచి ర‌క్షణ క‌ల్పించాల‌ని కోరారు. మాధవ్ ఏపీ సీఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Next Story
Share it