Telugu Gateway
Andhra Pradesh

సబ్బంహరి మృతి

సబ్బంహరి మృతి
X

కరోనాతో మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. అయితే సబ్బంహరికి కోవిడ్ నెగిటివ్ వచ్చిందని ఆయన తనయుడు వెల్లడించారు.

Next Story
Share it