Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌నూ స్పందించారు

జ‌గ‌నూ స్పందించారు
X

జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ ఫ‌లితాల‌పై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి తొలుత మీడియా ముందుకు వ‌చ్చి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న సీఎం జ‌గ‌న్ త‌ర‌పున వ్య‌క్తిగ‌తంగా, పార్టీప‌రంగా ప్ర‌జ‌ల‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఇంత‌టి ఘ‌న విజ‌యంపై సీఎం జ‌గ‌న్ మాత్రం తొలుత స్పందించ‌లేదు. కానీ రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఇలా ఉంది.

'దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలవల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచింది'. 'సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. అప్పుడు మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను'.. అని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

Next Story
Share it