Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ కు 'డేంజ‌ర్ బెల్స్ '!

జ‌గ‌న్ కు డేంజ‌ర్ బెల్స్ !
X

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించి మూడేళ్లు పూర్త‌యింది. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయం ఎలా ఉంది అనే అంశంపై ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన తెలుగు వెబ్ సైట్ స‌మ‌యం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌రిపింది. అందులో సీఎం జ‌గ‌న్ కు డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయ‌ని స్ప‌ష్టంగా తేలింది. మే నెల‌లోనే ప‌ది రోజుల పాటు నిర్వ‌హించిన ఈ పోల్ లో ప్ర‌తికూల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జ‌గ‌న్ మూడేళ్ల పాల‌న బాగాలేద‌ని చెప్పిన వారు 64.22 శాతం ఉంటే...బాగుంద‌ని చెప్పిన వారు 17.52 శాతం, చాలా బాగుంద‌ని 9.8 శాతం బాగుంద‌ని, 8.45 శాతం మాత్రం ప‌ర్వాలేద‌న్నారు. తొలి ఏడాది..రెండ‌వ ఏడాది ఫ‌లితాల ప్ర‌కారం చూస్తే మూడ‌వ ఏడాది జ‌గ‌న్ గ్రాఫ్ గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు స్ప‌ష్టం అయింది. అత్యంత కీల‌మైన ప్ర‌శ్న ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రికి ఓటు వేస్తార‌ని ప్ర‌శ్నిస్తే అధికార వైసీపీకి అనుకూలంగా 30.46 శాతం మంది చెప్ప‌గా..టీడీపీకి ఓటేస్తామ‌ని 37.54 శాతం మంది చెప్పార‌ని..జ‌న‌సేన‌-బిజెపి కాంబినేష‌న్ కు మాత్రం 26.37 శాతం మ‌ద్ద‌తుగా ఓటేస్తామ‌ని చెప్పిన‌ట్లు తేల్చారు. 5.63 శాతం మంది ఇతరులకు ఓటేస్తామని తెలిపారు. ఇందులో జ‌న‌సేన‌-బిజెపికి పెరిగిన ఓట్ల శాతం ఒకింత ఆశ్చ‌ర్యంగానే ఉన్నాయ‌ని చెప్పుకోవాలి. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ప్ర‌గ‌తి పథంలో నడిపిస్తోందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. 25.20 శాతం మంది అవునని సమాధానం ఇచ్చారు. 66.13 శాతం మంది కాదని బదులివ్వగా.. 8.67 శాతం మంది ఏ విష‌యం చెప్పలేమని తెలిపారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరపైకి తెచ్చిన మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌కు కూడా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌తికూల ఫ‌లితాలే రావ‌టం విశేషం. ఏపీ సీఎంగా చంద్ర‌బాబు ఉండ‌గా.. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యించ‌గా..సీఎం జ‌గ‌న్ త‌ర్వాత అయిన త‌ర్వాత ఆక‌స్మాత్తుగా మూడు రాజ‌ధానులను తెర‌పైకి తెచ్చిన విష‌యం తెలిసిందే. ఇదే అంశంపై ప్ర‌జ‌ల అభిప్రాయం అడ‌గ్గా..28.84 శాతం మంది మూడు రాజధానులు సమ్మతమేనని చెప్పగా.. 63.08 శాతం సమ్మతం కాదని చెప్పారు. ఈ విషయంలో 7.36 శాతం మంది తటస్థంగా ఉంటామన్నారు. అయితే స‌మ‌యం అభిప్రాయ సేక‌ర‌ణ‌లో ఎంత మంది పాల్గొన్నార‌నే నెంబ‌ర్ ను మాత్రం ఆ క‌థ‌నంలో ప్ర‌చురించ‌లేదు. జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఇదే టైమ్స్ ఇండియాతో జాతీయ స్థాయిలో సీఎం జ‌గ‌న్ తోపాటు ఏపీ ప్ర‌భుత్వ ఇమేజ్ పెంచుకునేందుకు ఏడు కోట్ల రూపాయ‌ల మేర మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది . ప్ర‌భుత్వంతో ఈ యాజ‌మాన్యానికి స‌త్సంబంధాలు ఉన్నందున కావాల‌ని ఇలా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ సేక‌ర‌ణ చేసి జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌టానికి కూడా ఛాన్స్ లేద‌ని భావించొచ్చు.

Next Story
Share it