Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుకు కోర్టు ధిక్కార నోటీసులు

ఏపీ సర్కారుకు  కోర్టు ధిక్కార నోటీసులు
X

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో కీలక మలుపు. ఏపీ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు నోటీసులివ్వాలని బుధవారం నాడు హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. కోర్టు ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సమయంలోనే ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

హైకోర్టు, మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించినా సాయంత్రం ఆరు గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని పేర్కొంది.

Next Story
Share it