Telugu Gateway
Andhra Pradesh

జగన్ ట్వీట్ పై దుమారం

జగన్ ట్వీట్ పై దుమారం
X

ఆర్ఆర్ఆర్ సినిమా కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటంపై ప్రధాని మోడీ దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కూడా ఆర్ఆర్ఆర్ టీం ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ చేసిన ట్వీటే దీనికి కారణం. సీఎం జగన్ ఆర్ఆర్ఆర్ టీం కు అభినందనలు తెలుపుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరి తరపున అభినందనలు తెలుపుతూ తెలుగు జండా ఉన్నతంగా ఎగిరింది అంటూ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సమీ ముందుగా మనం భారతీయులం అని..తెలుగు జండా కాకుండా జాతీయ జండా అని చెప్పి ఉండాల్సింది అని సూచించారు.

జగన్ ట్వీట్ వేర్పాటువాద వైఖరి తరహాలో ఉందని అంటూ పోస్ట్ పెట్టారు. అయితే అద్నాన్ సమీ ట్వీట్ పై మిశ్రమ స్పందలు వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలం సౌత్ పరిశ్రమను పట్టించుకోని వారు ఇప్పుడు విజయాలు అన్నీ దక్షిణాదివి కావటం తో ఇలా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ వరస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతుంటే దక్షిణాది సినిమాలు వరస విజయాలు సాగిస్తున్నాయని అందుకే ఇప్పుడు కలుపుకోవాలని చూస్తున్నారు అంటూ మరికొంత మంది స్పందించారు. సీఎం జగన్ ట్వీట్ పై రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మరికొంత మంది సమీ కు రిప్లై ఇచ్చారు మొత్తం మీద జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో పెద్ద రచ్చకు కారణం అయింది అని చెప్పొచ్చు.

Next Story
Share it