Telugu Gateway
Andhra Pradesh

క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌
X

భారీ వ‌ర్షాలు. వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం అయిన మూడు జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ పర్య‌ట‌న ఖ‌రారైంది. వరద నష్టాలు పరిశీలించి, బాధితుల సమస్యలు తెలుసుకుని త‌గు ఆదేశాలు ఇవ్వ‌నున్నారు. గురువారం ఉద‌యం ఆయ‌న తొలుత క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళ‌నున్నారు. పున‌రావాస శిబిరాల సంద‌ర్శ‌న‌తోపాటు వ‌ర్షాలు..వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్రాంతాల‌ను జ‌గ‌న్ ప‌రిశీలిస్తారు.త‌ర్వాత జిల్లా స‌మీక్ష నిర్వ‌హిస్తారు. అక్క‌డ నుంచి చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తారు.

గురువారం రాత్రి తిరుప‌తిలోనే బ‌స చేస్తారు. గురువారం ఉద‌యం తిరుప‌తిలో ప‌రిశీల‌న పూర్తిచేసి అక్క‌డ నుంచి నెల్లూరు జిల్లా వెళ‌తారు. నెల్లూరులో పెన్నా ప‌రివాహ‌క ప్రాంతంలో న‌ష్టాల‌ను ప‌రిశీలిస్తారు. దీంతోపాటు నెల్లూరు న‌గ‌రంలో కూడా ఎంపిక చేసిన ప్ర‌దేశాల‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డ నుంచి రేణిగుంట వెళ్లి గురువారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేర‌తారు.

Next Story
Share it