Telugu Gateway
Andhra Pradesh

ఆ భూములపై జగన్ కన్ను

ఆ భూములపై జగన్ కన్ను
X

ఏపీ సర్కారు తలపెట్టిన భూ సర్వేపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాలలో ప్రజల ఆస్తులను కొట్టేయడానికి జగన్ ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. చుక్కల భూములతోపాటు అసైన్డ్ ల్యాండ్స్, సొసైటి ల్యాండ్స్ ఆరు రకాల భూములపై జగన్ కన్నుపడిందని అన్నారు. అందుకే ఇప్పుడు భూసర్వే అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి చేస్తున్న భూ సర్వేతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఆస్తులను, భూములను ఏ రోజుకారోజు చెక్ చేసుకునే పరిస్థితి కల్పించారన్నారు. జగన్ అండతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోంది.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల భూకుంభకోణాలకు పాల్పడ్డారు. ఇళ్లస్థలాలకు భూసేకరణ పేరుతో రూ 4వేల కోట్ల ల్యాండ్ స్కామ్ లు చేశారు. ఆవ భూములు, మడ అడవులు, 10-15అడుగుల్లోతు ముంపు భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం, వాటి మెరక పేరుతో నరేగా నిధులు రూ2వేల కోట్ల గోల్ మాల్ చేశారన్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామంలో వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే జగన్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో అర్ధం చేసుకోవాలి. వైసీపీ నేతలు, వారి కార్యకర్తల ఆస్తులకే దిక్కు లేకపోతే ప్రజల ఆస్తులను ఏ విధంగా కాపాడుతారో ప్రజలు అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

Next Story
Share it