Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌నే..!

తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నార‌నే..!
X

ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో తెలంగాణ‌,ఏపీ మ‌ధ్య సాగుతున్న జ‌ల‌జ‌గ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ అంశంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నామ‌ని, ఏపీ వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేద‌న్నారు. ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ మంత్రులు ఎక్కువగా మాట్లాడుతున్నార‌న్నార‌ని వ్యాఖ్యానించారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాల‌ని ప్ర‌శ్నించారు. ‌

జల వివాదాలపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని సీఎం జగన్ మంత్రుల‌కు సూచించారు. తెలంగాణ విద్యుదుత్పత్తిపై మరోసారి కెఆర్ ఎంబీకి లేఖ రాయాలని జగన్‌ ఆదేశించారు. అదే స‌మ‌యంలో జల వివాదాలపై ప్రధాని మోడీకి కూడా లేఖ రాయాలని జగన్ నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్ల‌డించారు.

Next Story
Share it