Telugu Gateway
Andhra Pradesh

గౌతంరెడ్డికి సీఎం జ‌గ‌న్ నివాళులు

గౌతంరెడ్డికి సీఎం జ‌గ‌న్ నివాళులు
X

ఏపీ మంత్రి గౌతంరెడ్డి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న వెంట‌నే సీఎం జ‌గ‌న్ హైద‌రాబాద్ బ‌య‌లుదేరి వ‌చ్చారు. గౌతంరెడ్డి నివాసానికి వెళ్లి మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులను సీఎం దంపతులు ఓదార్చారు. సీఎంను చూసి గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. జగన్‌ను పట్టుకుని ఆమె భోరుమన్నారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని జగన్ ఓదార్చారు.

తొలుత మ‌ర‌ణ‌వార్త తెలిసిన స‌మ‌యంలో జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడుగా పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధను కలిగించిదన్నారు. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జ‌ర‌గ‌నున్న మంత్రి గౌతంరెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు సీఎం జ‌గ‌న్ హాజ‌రుకానున్నారు.

Next Story
Share it