Telugu Gateway
Andhra Pradesh

అమిత్ షాతో జగన్ భేటీ

అమిత్ షాతో జగన్ భేటీ
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం గంట పాటు సాగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకుని వరస పెట్టి భేటీలు నిర్వహించారు. ఇప్పుడు ఏపీ సీఎం వంతు వచ్చింది. సీఎం జగన్ మంగళవారం నాడు ఒక్క హోం మంత్రి అమిత్ షాతో సమావేశం పూర్తి చేసుకున్నారు.

అమిత్ షాతో భేటీ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో సాయం చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్‌ కోరినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలను అమోదించేలా సహకరించాలని విజ్ణప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు.

Next Story
Share it