Telugu Gateway
Andhra Pradesh

టీకా ఉత్సవ్ లో ఏపీనే టాప్

టీకా ఉత్సవ్ లో ఏపీనే టాప్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 60 లక్షల డోసుల వ్యాక్సిన్‌ పంపాలని కోరారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒక్కరోజే 6,28,961 డోసులు ఇచ్చినట్లు సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలోనే ఎక్కువ డోసులు ఇచ్చామని తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ప్రతి 50 కుటుంబాల అవసరాలను ఒక వాలంటీరు తీరుస్తున్నారని ప్రధానికి వివరించారు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఏపీలో వాలంటీర్లు సమర్థంగా చేపట్టారన్నారు. అర్హత ఉన్న ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్‌ అందేలా చూస్తున్నామని ప్రస్తావించారు. వచ్చే మూడు వారాల్లో ఏపీలో 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు. ఆ లక్ష్య సాధన కోసం ఏపీకి 60 లక్షల డోసులు కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా అవసరమైన డోసులు లేక పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది.

Next Story
Share it