Telugu Gateway
Andhra Pradesh

సిమ్లాలో సీఎం జ‌గ‌న్

సిమ్లాలో సీఎం జ‌గ‌న్
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రస్తుతం వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న సిల్వ‌ర్ జూబ్లి పెళ్ళి వేడుక‌లు జ‌రుపుకునేందుకు ఈ ప‌ర్య‌ట‌న త‌ల‌పెట్టారు. వైస్ జ‌గ‌న్, వైఎస్ భార‌తిలు సిమ్లా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మేరకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియ చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ దంపతులకు జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆయ‌న త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

Next Story
Share it