Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఫైబ‌ర్ నెట్ పై సీఐడీ విచార‌ణ‌

ఏపీ ఫైబ‌ర్ నెట్ పై సీఐడీ విచార‌ణ‌
X

ఏపీ స‌ర్కారు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గత ప్రభుత్వంలో ప్రారంభం అయిన ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై గ‌తంలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు విచార‌ణలు సాగుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఫైబ‌ర్ నెట్ కూడా చేరింది.

Next Story
Share it