Telugu Gateway
Andhra Pradesh

చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదు

చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదు
X

నివర్ తుఫాను బాధితుల పరామర్శ కోసం ఏపీలో రైతులతో సమావేశం అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుల జాగీరు ఏమీ కాదని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపైనా, పోలీసు వ్యవస్థపైనా గౌరవంతోనే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. జనసేన కార్యకర్తలు, నాయకులపై ఇలాగే దాడులు కొనసాగితే మాత్రం సహించేది లేదని తిరగబడతామని తేల్చి చెప్పారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ భారీ వర్షంలో కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటన సాగిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ గ్రామంలో మాట్లాడారు.

"దాడులు చేస్తే భయపడే వ్యక్తిని కాదు. తిరిగి గొడవ పెట్టుకుంటాం. నివర్ తుపాన్ కారణంగా సర్వం కోల్పోయిన రైతులకు అండగా ఉండి, వారిలో భరోసా నింపేందుకే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర కల్పించాలనేదే జనసేన పార్టీ లక్ష్యం. అందు కోసమే జై కిసాన్ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. యువతను అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి. ఒక్క జనసేన పార్టీ మాత్రమే వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చూస్తోంద"ని అన్నారు.

Next Story
Share it