బలంగా ఉన్న ఏపీ లో పొత్తులు..బలం లేని తెలంగాణాలో ఒంటరి పోరు

తెలంగాణాలో బిఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు కానీ..కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ లో అధికారంలోకి రాకూడదు అనే బీజేపీ ప్లాన్ అమలులో భాగంగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అని ఒక కీలక నేత వెల్లడించారు. బిఆర్ఎస్ ను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవచ్చు అని...అదే హైదరాబాద్ వంటి కీలక నగరం ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తమకు నష్టం అనే అంచనాతోనే బీజేపీ ఈ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెపుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ జోష్ లో ఉండగా..తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ కు సానుకూల వాతావరణమే ఉంది. ఈ తరుణంలో టీడీపీ నిజంగా తెలంగాణాలో ప్రభావం చూపించాలి...కొన్ని సీట్లు అయినా గెలవాలి అనుకుంటే బీజేపీ తో కాకపోయినా జనసేన తో కూడా కలిసి సాగే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు బలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పొత్తులతో ముందుకు వెళ్లాలని యోచిస్తూ...తెలంగాణాలో మాత్రం ఒంటరి జపం చేస్తున్నారు అంటే అయన ప్లాన్స్..అయన ఎవరి కోసం పని చేస్తున్నారో ప్రజలకు ఆ మాత్రం అర్ధం కదా అన్న చర్చ సాగుతోంది.