Telugu Gateway
Andhra Pradesh

ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం

ప్రశాంత రాష్ట్రంలో అల్లకల్లోలం
X

రాష్ట్రంలో జరుగుతున్న వరస రాజకీయ హత్యలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును కిరాతకంగా హత్య చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ''20ఏళ్లు సర్పంచిగా పనిచేసిన అంకులును హత్య చేయడం కిరాతక చర్య. గత 19నెలల్లో 16మంది టిడిపి కార్యకర్తలను మట్టుబెట్టారు. పొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకులు హత్య వైసిపి హత్యా రాజకీయాలకు నిదర్శనాలు అని ఆరోపించారు.

వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ పేట్రేగి పోయింది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. శాంతి భద్రతలను అధ: పాతాళానికి దిగజార్చారు. మాజీ సర్పంచి పురంశెట్టి అంకులు హంతకులను కఠినంగా శిక్షించాలి. వైసిపి హత్యారాజకీయాలను ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలని'' చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story
Share it