ఈ ప్రయత్నం ఫలిస్తుందా?

వై ఎస్ షర్మిల కవరేజ్ పూర్తిగా ఎత్తేయటంతో పాటు ఆమె చేసే విమర్శలకు కౌంటర్లు మాత్రం ప్రసారం చేయాలని సదరు పెద్దలు కోరినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వై ఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా జగన్ పై టీడీపీ, జనసేన కంటే ఎక్కువగా ఎటాక్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఆంధ్ర ప్రదేశ్ అన్యాయం చేసిన...ప్రత్యేక హోదా అమలు చేయని , పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వని బీజేపీకే ఊడిగం చేస్తున్నారు అని...ఏకంగా రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా మార్చారు అంటూ సంచనలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే షర్మిల పై సెన్సార్ వ్యవహారం ఎంత మేర వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. జగన్ ను వ్యతిరేకించే మీడియా అంతా షర్మిలకు మాత్రం పెద్ద ఎత్తున కవరేజ్ ఇస్తున్నాయి. షర్మిల సోమవారం నాడు ఇడుపుల పాయలో వై ఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో భేటీ కావటం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. సునీత కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది ప్రచారం జరుగుతోంది.