జగన్ కు నిజంగా ఇది పెద్ద షాకే!

ఈ తరుణంలో ప్రధాని మోడీ మంగళవారం ఉదయం వైఎస్ఆర్ టి పీ ప్రెసిడెంట్ వై ఎస్ షర్మిల కు ఫోన్ చేసి మాట్లాడారు. ముఖ్యంగా తాజా గా జరిగిన సంఘటనలు...రాజకీయ అంశాలు ప్రస్తావించారు. పది నిమిషాలు మోడీ షర్మిలతో మాట్లాడినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సొంత అన్న అసలు దీనిపై మాట్లాడక వదిలేస్తే స్వయంగా ప్రధాని మోడీ మాటలాడటం ఖచ్చితంగా ఇది సీఎం జగన్ కు షాక్ వంటి పరిణామం అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం పక్కా. మరో వైపు తెలంగాణ లో అధికార టిఆర్ఎస్ మాత్రం షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ విమర్శలు చేస్తుంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ ఫోన్ చేయటం కీలకంగా మారింది. తనకు సంఘీభావం తెలిపిన మోడీపై వై ఎస్ షర్మిల థాంక్స్ చెప్పారు.