Telugu Gateway
Andhra Pradesh

పది కోట్లు పెట్టుబడి పెట్టి...ఏడాదిలోనే 150 కోట్లు డిమాండ్

పది కోట్లు పెట్టుబడి పెట్టి...ఏడాదిలోనే 150 కోట్లు డిమాండ్
X

ఆయనో ఎంపీ. ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ సర్కారు వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని..చేసి తీరతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ ఇప్పటికే డెవలప్ అయిన నగరం. అలాంటిది రాజధాని కూడా వస్తే ఇక ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో లెక్కలు వేసుకుని ఒక ఎంపీ ఏకంగా ఏభై ఎకరాల్లో అత్యంత విలాసవంతమైన విల్లాల ప్రాజెక్ట్ కు రెడీ అయ్యారు. పక్కాగా...ముందస్తు ప్లానింగ్ లో భాగంగా భూమి సేకరించి పెట్టుకుని అంతా రెడీ చేసుకున్నారు. అక్కడి వరకు అంతా బాగానే సాగింది. తర్వాతే అసలు విషయం స్టార్ట్ అయింది. క్యాష్ రిచ్ ఎంపీ విల్లా ప్రాజెక్ట్ విషయం తెలుసుకున్న ముఖ్యనేత ఇందులో తన వాటాగా పది ఎకరాలు పక్కన పెట్టాలని ఆదేశించారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన వ్యక్తిని ఇందులో వాటా దారు గా చేర్చారు. దీని కోసం ఒక పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించారు కూడా. కానీ నిండా ఏడాది తిరగకుండానే...దీని నుంచి బయటకు వెళ్ళిపోదాం అని నిర్ణయం తీసుకున్నాం అని...తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరారు.

దీంతో సదరు ఎంపీ ముఖ్య నేత బంధువు కోరినట్లు దగ్గర దగ్గర 150 కోట్ల రూపాయలు ఇచ్చి...ఆయన్ను బయటకు పంపారు. ఎంత మొత్తం ఇవ్వాలో కూడా వాళ్లే డిసైడ్ చేశారు. అంటే పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏడాదిలో 150 కోట్లు తీసుకోవటం అంటే...బహుశా ప్రపంచంలో ఎందులోనూ ఇంత లాభం రాదు అనే చెప్పొచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు వైజాగ్ లోని రియల్ ఎస్టేట్ సర్కిల్స్ లో పెద్ద సంచలనంగా మారింది. పైసా పెట్టుబడి పెట్టకుండా ముఖ్యనేత దక్కించుకున్న పది ఎకరాల విలువే కోట్ల రూపాయలు ఉంటుంది అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం చేతిలో ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం అనుమతులు ఇప్పించినందుకుగాను ఇంత భారీ మొత్తంలో సదరు ఎంపీ ముఖ్య నేత కు...అయన బంధువుకు భారీ మొత్తంలో సమర్పించుకోవాల్సి వచ్చింది అని చెపుతున్నారు. వైజాగ్ లో ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు అంటూ ఈ రంగంలోని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it