కీలక శాఖల మంత్రులంతా చివరిలోనే
గుడ్ గవర్నెన్స్..పారదర్శక పాలన..రియల్ టైం గవర్నెన్స్ ఇవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఊత పదాలు. ప్రభుత్వంలో ఫిజికల్ ఫైల్స్ సిస్టం పోయే చాలా సంవత్సరాలే అయింది. ఇప్పుడు అంతా ఆన్ లైన్లోనే . డిజిటల్ సిగ్నేచర్ తోనే ఫైల్స్ క్లియర్ చేయవచ్చు. దీనికి ఆఫీస్ లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి...బయటకు వెళ్లినా కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేయవచ్చు. కానీ మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కూటమి సర్కారులో ఫైల్స్ క్లియర్ అవుతున్న తీరు చూస్తే అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు అనే చెప్పాలి. వాస్తవానికి మంత్రులకు ఫైల్స్ క్లియర్ చేసేంత తీరిక లేకుండా ఏమి చేస్తున్నారు అనే ప్రశ్న ఉదయించకమానదు. తమ దగ్గరకు వచ్చే ఫైల్స్ ను వెంటనే క్లియర్ చేయటం...వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే వెనక్కి పంపి వివరణలు తీసుకుని పరిష్కరించాలి.
గురువారం నాడు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి చంద్రబాబు మంత్రుల ర్యాంకింగ్స్ బయటపెట్టారు. ఇందులో విచిత్రం ఏమిటి అంటే అత్యంత కీలకమైన రెవిన్యూ, ఆర్థిక, హోమ్ శాఖల మంత్రులు ఈ లిస్ట్ లో చివరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉండటం మరో విశేషం. ఫస్ట్ ప్లేస్ లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ ఉన్నారు. లాస్ట్ ప్లేస్ లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఫైల్స్ కియరెన్సు లో మంత్రుల ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.
1.ఫరూఖ్
2. కందుల దుర్గేష్
3.కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోలా బాలవీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు
7. సత్యకుమార్ యాదవ్
8. నారా లోకేష్
9. బీసీ జనార్థన్ రెడ్డి
10. పవన్ కళ్యాణ్
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టీజీ భరత్
16. ఆనం రాం నారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారధి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్



