Telugu Gateway
Andhra Pradesh

చైనా దురాక్రమణకూ జగనే కారణం అంటాడు చంద్రబాబు

చైనా దురాక్రమణకూ జగనే కారణం అంటాడు చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏది జరిగినా.. చైనా దురాక్రమణలు చేసినా దానికి సీఎం జగనే కారణమని చంద్రబాబు పిచ్చిమాటలు మాట్లాడతాడని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం బిడ్డింగ్‌కు వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వమే వెళ్లి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటుందని తెలిపారు. ఏదో ఒకటి‌ మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకోవడం సరికాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని ఒక్క మాట అనడు.. మోదీ అంటే చంద్రబాబుకు భయమని తెలిపారు.

ప్రైవేటీకరణ మా చేతిలో ఉంటే మమ్మల్ని తిట్టండి.. మేం పడతామని అన్నారు. అడ్డమైన వాళ్లకు ఉత్తరాలు రాసే చంద్రబాబు ప్రధాని మోదీకి ఎందుకు రాయడని నిలదీశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని వదిలి సీఎం జగన్‌ను చంద్రబాబు విమర్శించటాన్ని తప్పుబట్టారు. ఈ పదిహేను రోజుల్లో 'నువ్వు.. నీ కొడుకు ఏ ఒక్కరోజైనా కేంద్రాన్ని ప్రశ్నించారా?' అని మంత్రి నిలదీశారు. 2017లో కొరియాలో పోస్కో ప్రతినిధులను ఎందుకు కలిశాడో చంద్రబాబు ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Next Story
Share it