Telugu Gateway
Andhra Pradesh

ఏపీ మంత్రి గౌతంరెడ్డి క‌న్నుమూత‌

ఏపీ మంత్రి గౌతంరెడ్డి క‌న్నుమూత‌
X

విషాదం. ఏపీ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి క‌న్నుమూశారు. ఆయ‌న జగ‌న్ కేబినెట్ లో ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖ మంత్రిగా ఉన్నారు. దుబాయ్ లో జ‌రిగిన పెట్టుబ‌డుల స‌ద‌స్సులో పాల్గొన్న గౌతంరెడ్డి ఇటీవలే హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. సోమ‌వారం ఉద‌యం గుండెపోటు రావ‌టంతో ఆయ‌న్ను అపోలో ఆస్ప‌త్రిలో చేర్పించారు. అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయినా స‌రే వైద్యులు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. యువ‌కుడు అయిన మంత్రి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌రం అంద‌రినీ షాక్ కు గురిచేసింద‌నే చెప్పాలి. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల ద్వారా ఆయ‌న రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. మేక‌పాటి గౌతంరెడ్డి వ‌య‌స్సు 50 సంవ‌త్స‌రాలే.

Next Story
Share it