Telugu Gateway
Andhra Pradesh

జె సీ దివాకర్ రెడ్డికి వంద కోట్ల షాక్

జె సీ దివాకర్ రెడ్డికి వంద కోట్ల షాక్
X

ఏపీ సర్కారు టీడీపీ మాజీ ఎంపీ జె సి దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. ఏపీ మైనింగ్ అధికారులు ఆయనకు 100 కోట్ల రూపాయల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగిందని, విలువైన లైమ్ స్టోన్‌ను తవ్వి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో అధికారులు ఈ మేరకు జరిమానా విధించారు. కోట్లాది రూపాయల విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారు. అంతేకాకుండా అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారు.

Next Story
Share it