Telugu Gateway
Andhra Pradesh

ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు షాక్..వారం రోజుల జైలు శిక్ష

ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు షాక్..వారం రోజుల జైలు శిక్ష
X

ఏపీ హైకోర్టు సంచల‌న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల‌ను పాటించ‌ని ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌రించింది. గిరిజాశంక‌ర్, చిరంజీవి చౌద‌రి హైకోర్టు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ధిక్కారం కింద ప‌రిగ‌ణిస్తూ ఈ మేర‌కు ఆదేశాలు ఇచ్చారు. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ హైకోర్టు ఏప్రిల్‍లో ఆదేశాలు ఇచ్చింది. అయినా వారు కోర్టు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేదు. కోర్టు ఆదేశాల‌తో మంగ‌ళ‌వారం నాడు చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ లు వ్య‌క్తిగ‌తంగా కోర్టు ముందు హాజర‌య్యారు. వీరికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది.

Next Story
Share it