Telugu Gateway
Andhra Pradesh

క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 లక్షలు మంజూరు

క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు  17 లక్షలు మంజూరు
X

రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 ల‌క్షల రూపాయ‌లు మంజూరు చేసింది. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి ఈ మేర‌కు విడుద‌ల చేశారు. చెన్న‌య్ లోని అపోలో ఆస్ప‌త్రికి ఎల్ వోసీ ఇస్తూ ఆదేశాలు వెలువ‌డ్డాయి.

క‌త్తి మహేష్ ప్ర‌యాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్ట‌డంతో ఆయ‌న కంటికి..త‌ల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తొలుత నెల్లూరులో చికిత్స అందించి..మెరుగైన వైద్యం కోసం చెన్న‌య్ లోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. అపోలో ఆస్ప‌త్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

Next Story
Share it