ప్లానింగ్ కమిటీ ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెర్టిపోర్ట్స్ ఏర్పాటుపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (ఏఏఎం) కోసం ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఎండీ నేతృత్వంలో ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. రెగ్యులర్ విమానాలు టేకాఫ్ కావాలంటే పెద్ద పెద్ద రన్ వే లు అవసరం అవుతాయి అనే విషయం తెలిసిందే. ఎయిర్ టాక్సీ ల నిర్వహణకు వెర్టిపోర్ట్స్ ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన ప్రాంతం నుంచే అవి నిటారుగా టేకాఫ్ కావటంతో అలాగే ల్యాండ్ అవుతాయి. వీటికి ల్యాండింగ్ ప్యాడ్స్ తో పాటు ప్యాసింజర్ టెర్మినల్స్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అయితే భారీ భారీ బిల్డింగ్ ల మీద వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కీలక నగరాల్లో వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవటనికి...కార్గో రవాణాకు కూడా ఇవి ఉపయోగపడతాయి. వెర్టిపోర్ట్స్ ప్లానింగ్ కమిటీ కి ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఎండీనే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా నియమించారు.



