లిక్కర్ బాండ్స్ తో 8000 కోట్లు..ఇది ఏపీ సర్కారు వారి పాట!
![లిక్కర్ బాండ్స్ తో 8000 కోట్లు..ఇది ఏపీ సర్కారు వారి పాట! లిక్కర్ బాండ్స్ తో 8000 కోట్లు..ఇది ఏపీ సర్కారు వారి పాట!](https://telugugateway.com/h-upload/2022/06/11/1544246-ap-govt.webp)
గత కొంత కాలంగా ఏపీ సర్కారుకు లిక్కర్ ద్వారా భారీ ఎత్తున ఆదాయం వస్తోంది. అంతకు ముందు ఏడాది లిక్కర్ ఆదాయం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటే..గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా ఇది 18 వేల కోట్ల రూపాయలకు చేరింది. మర్చంట్ బ్యాంకర్లు ఈ బాండ్స్ పై మంచి విశ్వాసంతో ఉండటంతో ఇది విజయవంతం అయింది. ఎన్ సీడీల పై కనీస వడ్డీ 7.5 శాతం ఖరారు చేయగా..గరిష్టంగా ఇది 9.5 శాతానికి చేరింది. మద్యం ఆదాయానికి సంబంధించి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి..రోజువారీ ప్రాతిపదికన మద్యం ద్వారా వచ్చే డబ్బును ఆ ఖాతాలో జమ చేయనున్నారు.