Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితాలోకి బ్లాక్ ఫంగస్

ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితాలోకి బ్లాక్ ఫంగస్
X

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఇఫ్పటికే ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందిస్తున్న ప్రభుత్వం ఇఫ్పుడు బ్లాక్ ఫంగస్ ను కూడా ఆ జాబితాలో చేర్చించింది. గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ సమస్య వేధిస్తోంది. దీంతో సోమవారం నాడు కరోనాపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారని..ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతోపాటు కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నామని ఆళ్ళ నాని వెల్లడించారు.

Next Story
Share it