Telugu Gateway
Andhra Pradesh

ఆగ‌స్టు 14 వ‌ర‌కూ ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ

ఆగ‌స్టు 14 వ‌ర‌కూ ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ
X

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న త‌రుణంలో కేంద్రం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ లేఖ కూడా రాసింది. తాజాగా ఏపీ స‌ర్కారు ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు ఉంటాయ‌న్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆదేశాలు వెళ్లాయి.

Next Story
Share it