Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్

ఏపీలో జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్
X

ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే థియేటర్లలో 50 శాతం మేర మాత్రం సీటింగ్ సామర్ధ్యానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.దీంతోపాటు జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేయమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి అని ఏపీ వైద్యశాఖ స్పష్టం చేసింది. 50 శాతం పరిమితితోనే ప్రజారవాణాకు అనుమతిస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ తో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తున్నాం.. రెమిడెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రెమిడెసివిర్‌ కొరత ఉంటే హెల్ఫ్‌ లైన్‌ నంబర్లకు కాల్‌ చేయాలని సూచించింది. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా ఏపీలోనూ ఆక్సిజన్ కొరతతోపాటు బెడ్స్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

Next Story
Share it