Telugu Gateway
Andhra Pradesh

విశాఖ‌లో పీ వీ సింధు అకాడ‌మీకి భూ కేటాయింపు

విశాఖ‌లో పీ వీ సింధు అకాడ‌మీకి భూ కేటాయింపు
X

ప్ర‌ముఖ బాడ్మింట‌న్ క్రీడాకారిణి పీ వీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌భుత్వం భూమి కేటాయించింది. బాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు ఈ కేటాయింపు చేశారు. విశాఖ రూర‌ల్ మండ‌లంలోని చిన‌గ‌దిలి వ‌ద్ద రెండు ఎక‌రాలు ఇచ్చారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ కోణంలో ఉచితంగానే ఈ భూమిని కేటాయిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిని కేవ‌లం అకాడ‌మీ అవ‌సరాల కోస‌మే వినియోగించాలి త‌ప్ప‌..ఇందులో ఎలాంటి వాణిజ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని నిబంధ‌న‌ల్లో పేర్కొన్నారు.

ఈ అకాడ‌మీ ద్వారా ప్ర‌తిభ ఉన్న పేద‌ల‌కు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. మొత్తం ప‌ది కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో రెండు ద‌శ‌ల్లో అకాడ‌మీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు పీ వీ సింధు ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది.

Next Story
Share it