Telugu Gateway
Andhra Pradesh

మంత్రుల ప్ర‌తిపాద‌న‌కు నో....స‌మ్మె నోటీసుతో ముందుకే

మంత్రుల ప్ర‌తిపాద‌న‌కు నో....స‌మ్మె నోటీసుతో ముందుకే
X

ఏపీ స‌ర్కారు వ‌ర్సెస్ ప్ర‌భుత్వ ఉద్యోగులు. స‌మ్మె వ‌ద్దు..చ‌ర్చిద్దాం రండి మంత్రుల ప్రతిపాద‌న‌ను ఉద్యోగ సంఘాల నేత‌లు తిర‌స్క‌రించారు. ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే సోమ‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌కు నోటీసు ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు ఆదివారం నాడు స‌మావేశం అయిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి జిల్లాకు ప్రతి జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించింది. ఉద్యమం విజయవంతం చేయడానికి నలుగురు నాయకులను పంపాలని తీర్మానించింది. ప్రతిరోజూ జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై రాష్ట్రస్థాయి నాయకులు నివేదిక ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ‎లను కలుపుకుని ఉద్యమం చేయాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోలను ఇచ్చి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘ నేతల ఆరోపిస్తున్నారు. చీకటి జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. హెచ్‎ఆర్‏ శాబ్ లో పాత పద్ధతిలోనే ఉద్యోగులకు మంజూరు చేయాలని కోరుతున్నారు. పీఆర్సీకి డీఏ‌కి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. జీతం పెరిగిందని రుజువు చేస్తే కార్యాచరణ ఆపడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. తమకు పాత పీఆర్సీనే అమలు చేసి డీఏలు చెల్లించాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఉద్యోగులు అందరూ కలిసి పాత పద్ధతిలోనే 11వ పీఆర్సీ అమలు కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ స‌మావేశంలో ఉద్యోగ సంఘాల నేత‌లు బండి శ్రీనివాస‌రావు, బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు, వై వీ రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

Next Story
Share it