ఏపీలో ఎంసెట్ ఈప్ సెట్ గా మార్పు
BY Admin19 Jun 2021 7:11 AM GMT
X
Admin19 Jun 2021 7:11 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈప్ సెట్) నిర్వహించనుంది. ఈ విషయాన్నివిద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వివరించారు. ఇప్పటివరకూ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్)గా ఉన్న దీన్ని ఇప్పుడు ఈప్ సెట్ గా మార్చారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఈప్ సెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story